మేడ్చల్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు జారీ చేఇంది. డిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు జారీ అయ్యాయి. చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసారు. కాలేజీలకు ప్రత్యామ్నాయా మార్గాలు చూసుకోవాలి... లేనిపక్షంలో చర్యలు తప్పవంటూ హైడ్రా నోటీస్లో పేర్కోంది. చెరువులో నిర్మించిన మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీలను హైడ్రా బృందం పరిశీలించింది.గతంలో చిన్నదామోర చెరువు ఎఫ్.టి.ఎల్లో నిర్మించిన కొన్ని బిల్డింగులు మున్సిపల్ అధికారులు కూల్చేసిన విషయ తెలిసిందే.