మేడ్చల్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో పాటు బిఆర్ఎస్ పార్టీ కి మరో బిగ్ షాక్ తగిలింది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పై నేటి నుండి కాంగ్రెస్ జండా ఎగరనుంది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం ఇరవై ఆరు మంది కార్పోరేటర్లు ఉండగా , బిఆర్ఎస్ మేయర్ జక్కా వెంకటరెడ్డి పై ఇరవై ఒక్క కార్పోరేటర్లు అవిశ్వాసం ప్రకటించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన నోటీసు మేరకు ఈనెల తొమ్మిదిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయం లో మేయర్ జక్కా వెంకటరెడ్డి పై అవిశ్వాసం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి పదవీచ్యుతులు అయ్యారు. అదే రోజు మెజారిటీ కార్పోరేటర్లు తమ నూతన మేయర్ అభ్యర్థిగా పన్నెండవ డివిజన్ కాంగ్రెస్ కార్పోరేటర్ అమర్ సింగ్ ను మేయర్ గా ఎన్నుకున్నారు. దీంతో అమర్ సింగ్ నూతన మేయర్ గా శుక్రవారం పదవీబాధ్యతలు స్వీకరించారు.