ఖమ్మం
ఖమ్మం పట్టణంలో కరుణగిరి సాయి కృష్ణ నగర్ నియర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఓ కుటుంబం ఐదు గంటల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వారిలో ఐదుగురు పిల్లలు, ఒక వికలాంగుడు, ఐదుగురు పెద్దవాళ్ళు ఉన్నారు. వరద నీరు మొదటి ఫ్లోర్ నిండి సెకండ్ ఫ్లోర్ సగానికి వచ్చిన నీళ్లు రెండో ఫ్లోర్ వరకు రావడంతో స్లాబ్ ఎక్కి తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మమ్మల్ని కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.