హైదరాబాద్
భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ గా ఉండాలి. కలెక్టరేట్ ల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాలు, వరదలపైఅయన సమీక్ష నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ రంమాండ్ కంట్రోల్ సెంటర్ లో వ్యవస్థ ను సన్నద్దంగా ఉంచుకోవాలి. భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్ట్రంలో ని 8 పోలీస్ బెటాలియన్ల కు ఎన్డీ ఆర్ఎఫ్ తరహా లో శిక్షణ ఇవ్వాలి. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం 4 లక్షల నుంచి 5 లక్షలకు పెంచామని అన్నారు.ప్రజలకు జరిగిన నష్టం పై తక్షణమే అధికారులు స్పందించాలి. వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు,గొర్రెల కు పరిహారం పెంచాలి. వరద నష్టం పైన కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని అన్నారు.