మహబూబాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు పురుషోత్తమాయగూడెం సీతారాం తండాలో పర్యటించారు. తండాలో బాధితులని పరామర్శించారు. తక్షణమే అందరికీ ఇల్లు కట్టించాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీతక్కలకు సూచనలు చేసారు. మృతుల కుటుంబాలకు బాధితులకి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. తక్షణ సహాయం కింద పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేసారు. వరదల్లో కొట్టుకుపోయిన స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్, పట్టా పాసుపుస్తకాలు ఇంకా ఏవిధమైన కాగితాలు పోయినా వెంటనే పోలిస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయండి. అధికారుల టెక్నికల్ ఇష్యూ లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రత్యేక ఫండ్ కింద 5 కోట్ల రూపాయల కలక్టర్ నిదిలో విడుదల చేశాం. సమస్యలలో ఉన్న వారందర్నీ ఆదుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని అన్నారు.