సికింద్రాబాద్..
గాంధీ హాస్పిటల్ కు వచ్చేది నా జనం, దొర జనం కాదు.. వాళ్ల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు మంత్రి విచ్చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అన్ని వార్డులను సందర్శించి రోగులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రోగుల సహాయకులు కింద కూర్చోవడం చూసి ఆగ్రహం వ్యక్తం చేసారు. సరిపోయే విధంగా కుర్చీలు వేయించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే అన్ని సుపర్ స్పెషల్ సర్వీస్ లకు రెండవ యూనిట్ ప్రారంభిస్తామని తెలిపారు. మెరుగైన సేవలందించాలని, సహాయకులను కింద కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టవద్దని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 8వ అతస్తూ పూర్తిగా శస్త్ర చికిత్సలకు కేటాయించి, శస్త్ర చికిత్స కేంద్రాలను పెంచనున్నట్లు చెప్పారు. వైద్యులు, సిబ్బందిని త్వరలోనే పెంచుతామని వెల్లడించారు..