మహబూబాబాద్
ఇంటికన్నెకేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తిఅయింది. వరద దాటికి రెండు రోజుల క్రితం రైల్వే ట్రాక్ ధ్వంసమైన విషయం తెలిసిందే. 36 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రైల్వే శాఖ రికార్డు సృష్టించింది. సింగిల్ రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. అధికారులు ట్రాక్ పై ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ పూర్తయితే క్లియరెన్స్ ఇచ్చే అవకాశం వుంటుంది.