YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అకాల వర్షాలు వల్ల మళ్ళీ బుడమేరుకు వరద

అకాల వర్షాలు వల్ల మళ్ళీ బుడమేరుకు వరద

గొల్లపూడి
అకాల వర్షాల వల్ల మళ్ళీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు విజ్ఞప్తి చేశారు.  ఆయన బుధవారం మాట్లాడుతూ మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున మైలవరం, ఎగువ ప్రాంతమైన ఖమ్మం ఏరియాలో వర్షాలు పడటం వల్ల బుడమేరుకు 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోందన్నారు.  కొండపల్లి శాంతినగర్ ఎర్రబడ్జి వద్ద ఉన్న చెరువు కట్ట కూడా తెగిందన్నారు. దయచేసి చెరువుల గండ్లను తక్షణమే పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. అలానే బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తను గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్నానని అన్నారు. జక్కంపూడి కాలనీలోని వరద బాధితులకు ఆహారాన్ని పంపించే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. అత్యవసరమైతే తనకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts