హైదరాబాద్
ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ అడాక్ కమిటీ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను కలిసారు. గణేషుడి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ను ఆహ్వానించారు. వినాయక చవితి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు పూజలో గవర్నర్ పాల్గొంటారు. వినాయక చవితి ఉదయం 11 గంటలకు మొదటి పూజలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోంటారు. ముఖ్యమంత్రి తో పాటు ఉపముఖ్యమంత్రి పలువురు మంత్రులు పాల్గొననున్నారు.గురువారం గణేష్ నేత్ర దర్శన కార్యక్రమం వుంటుంది.