YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది

సిద్దిపేట
సిద్దిపేట లోని  క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా హరీష్ రావు  మాట్లాడుతూ ఖమ్మం మహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సిద్దిపేట నుండి ఉడుత భక్తిగా సహాయం చేస్తున్నాం.  మానవ సేవయే మాధవ సేవ అని అందురూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలి.  సహాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది..  రాష్ట్రంలో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన నడుస్తుంది.  ముందుగా ప్రభుత్వం మేలుకుంటే మరింత ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉండే.  బి ఆర్ ఎస్ ఎంఎల్ఏ లు ఎంపీ లు ఎంఎల్ సి ల నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని అన్నారు.
మా తరహాలో బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలి.  మేము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే మాపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారు.  అక్కడి ప్రజలు ప్రభుత్వం పై దుమ్మూ ఎత్తి పోశారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు.  మాకు వస్తున్న స్పందన ను చూసి ఓర్వలేకనే దాడులు చేస్తున్నారు.  బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేక పోయారు. ఇండ్లు నీళ్లలో మునిగి పోయిన వారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.

Related Posts