YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజాహితం కోసం నా పోరాటం సీఎం చంద్రబాబు

ప్రజాహితం కోసం నా పోరాటం సీఎం చంద్రబాబు

ఏలూరు
రైతులు, వరద బాధితులు ముఖాముఖిలో ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు మాట్లాడారు.  నేరస్థులు రాజకీయ ముసుగు వేసుకున్నారు. తొమ్మిదేళ్లలో రౌడీలు అనే వారు లేకుండా చేశాం. ఇప్పుడు నాకు పెను సవాలుగా వుంది. రాజకీయ పార్టీపై దాడి చేసిన వారిని అరెస్టు చేస్తే ధర్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయాలపై, వ్యక్తులపై గతంలో ఎప్పుడూ దాడులు లేవు. ఒక నేరస్తుడితో ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నాను. ప్రజా హితం కోసం ఈ పోరాటం చేస్తున్నాను. ప్రజలు శభాష్ అనేలా అధికారులు పనిచేసారు. నేను తిరుగుతున్నానని తెలిసి హెలికాప్టర్లలో తిరిగే వాడు ఒకరోజు వచ్చి బురదలో దిగాడు... మళ్ళీ కనిపించలేదు. ఖజానా ఖాళీ...అభివృద్ధి లేదు, అప్పుల వాళ్ళు తిరుగుతున్నారని అన్నారు.
మన సంపాదన. ప్రజలు గత ఎన్నికల్లో మంచి పనిచేసారు... కూటమి అభ్యర్థులను గెలిపించారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. మనం ఎన్డీయేలో భాగస్వామ్యం కాబట్టి కేంద్రం కూడా సహాయం అందిస్తోంది. మేము ఇచ్చిన హామి ప్రకారం మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.

Related Posts