YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతులకు అండగా ఉంటాం మంత్రి శ్రీధర్ బాబు

రైతులకు అండగా ఉంటాం  మంత్రి శ్రీధర్ బాబు

రంగారెడ్డి
ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను బీఆర్ఎస్ పాలనలో లాక్కున్నారని భూ బాధితులు మంత్రి శ్రీధర్ బాబు, కేఎల్ఆర్ ముందు వాపోయారు. బడంగ్ పేట కార్పొరేషన్ మల్లాపూర్ లో వైయేఆర్ గార్డెన్ లో బడంగ్ పేట, మీర్పేట్ కార్పొరేషన్ల రైతులతో సమావేశం అయ్యారు.
కాసువాగు భూములకు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని నాదర్ గుల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా సాగు చేసిన భూములను లాక్కొని ప్రభుత్వ బిల్డింగ్స్, లేఅవుట్ వేస్తూ.. మా కుటుంబాలను రోడ్డు పాలు చేశారని బడంగ్ పేట, కుర్మల్ గూడ, గుర్రంగూడ దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థలాల పట్టాలు ఇచ్చి పోజిషన్ చూపించకుండా సర్టిఫికెట్లతో సరిపెడుతున్నారని లబ్ధిదారులు మంత్రి శ్రీధర్ బాబు, లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు... క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.
కబ్జాదారులపై ఉక్కుపాదం మోపేందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా హైడ్రాను తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, పార్కులు ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయో రిపోర్టు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, యల్మేటి అమరేందర్ రెడ్డి, పుట్టగళ్ల జగన్, బొక్క జంగారెడ్డి, బోయపల్లి గోవర్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గుడ్ల శ్రీనివాస్ సహా కాంగ్రెస్ నాయకులు, స్థానిక రైతులు, అధికారులు పాల్గొన్నారు.

Related Posts