YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముంబై నటి జత్వానీ కేసులో నెక్స్ట్ ఎవరు

ముంబై నటి జత్వానీ కేసులో నెక్స్ట్ ఎవరు

గుంటూరు, సెప్టెంబర్ 16,
ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు ఇప్పుడు ఏపీలో రాజకీయ సంచలనంగా మారింది.  ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ముంబై నటి జెత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు  విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా  ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీపై  సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేశారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు.వైసీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జత్వానీని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అభియోగాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఓసారి విజయవాడ వచ్చి వెళ్లిన కాదంబరీ ఇటీవలే మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీ నేత విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకంగా ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు గుర్తించారు. దీనిపై నివేదికను డీజీపీకి సమర్పించారు. ఈ క్రమంలో ముగ్గురు ఐపీఎస్‌లపైనా తాజాగా వేటు పడింది.అటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో కూడా ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఇద్దరు అధికారులపై తాజాగా వేటు పడింది. మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పోలీసులే ఈ కేసులో కీలక నిందితులుగా మారే అవకాశముంది. కాదంబరి జత్వానీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ మధ్య ఉన్న గొడవలో చివరకు పోలీసులు బలైపోతున్నారు. ఇప్పటికే ఇద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన జరిగినప్పుడు విజయవాడ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, అప్పటి ఇబ్రహీం పట్నం సీఐ సత్యనారాయణను పోలీసులు తాజాగా సస్పెండ్ చేశారు. వారిద్దరూ ఈ కేసులో కీలకంగా మారారు. కాదంబరిపై కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆమె ఇంటరాగేషన్ లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న సత్యనారాయణ కూడా ముందూ వెనకా ఆలోచించకుండా అప్పటి ప్రభుత్వంలోని పెద్దలుచెప్పినట్టే చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలను ప్రాథమికంగా నిర్థారించుకుని ఇద్దరిపై పోలీస్ డిపార్ట్ మెంట్ సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో ఎప్పుడూ ఐపీఎస్ అధికారులు నేరుగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న దాఖలాలు లేవు. మొత్తానికి కాదంబరి వర్సెస్ కుక్కల విద్యాసాగర్ అనే కేసు.. చివరకు పోలీసుల మెడకు చుట్టుకుంది. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ముగ్గురు వీఆర్ లో ఉన్నారు. త్వరలో ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని, వారిపై విచారణ కూడా జరిగే అవకాశముందని అంటున్నారు.ఇప్పటికే ఈ కేసు విషయంలో ఓసారి విజయవాడ వచ్చి వెళ్లిన కాదంబరి, తాజాగా.. ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్ట్ చేసి, తనను ఇబ్బందులు పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్ తో పాటు, ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలసి ఆమె పోలీస్ స్టేషన్ కి వచ్చారు.వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ తో పోలీసులే తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని, అప్పటికప్పుడు కేసు నమోదు చేశారని అంటున్నారు జత్వానీ. ఆ తర్వాత తనతోపాటు, తన తల్లిదండ్రుల్ని కూడా ముంబైలో అరెస్ట్ చేశారన్నారు. దీని వెనక కుట్రకోణం ఉందని ఆమె అంటున్నారు. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు న్యాయసలహా తీసుకుని కేసు పెడతామన్నారు

Related Posts