YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుక్మా జిల్లాలో నక్సల్స్ మళ్లీ ప్రజా కోర్టు ఓ ఉపాధ్యాయుడికి ఉరి

సుక్మా జిల్లాలో నక్సల్స్ మళ్లీ ప్రజా కోర్టు ఓ ఉపాధ్యాయుడికి ఉరి

సుక్మా
సుక్మా జిల్లాలోని జేగురుకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని నక్సల్స్ మరోసారి అనాగరిక ఘటనకు పాల్పడ్డారు. ప్రజాకోర్టు నిర్వహించి ఉపాధ్యాయుడ్ని లాఠీలతో కొట్టి తాడుతో ఉరి వేసి హత్య చేసారు. సెప్టెంబర్ 14న సుక్మాలోని జాగర్గుండ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. గొండపల్లికి చెందిన దూది అర్జున్ అనే ఉపాధ్యాయుడిని మావోయిస్టులు కిరాతకంగా హత్య చేసారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా  దూది అర్జున్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు.  ఘటనను సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ దృవీకరించారు.

Related Posts