YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కన్నడ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఫైర్

కన్నడ రాజకీయాలపై ప్రకాష్ రాజ్ ఫైర్
కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విలక్షణ నటుడు విలక్షణ నటుడు తాజాగా ఆ రాష్ట్ర రాజకీయాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలపై విమర్శలు గుప్పించిన ఆయన, నేతల తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘కర్ణాటక రాజకీయాలు..!! ఒక పార్టీ బీజేపీ డబ్బు, అధికారంతో లాబీయింగ్‌కు ప్రయత్నించింది... మీరు కాంగ్రెస్/జేడీఎస్ నేతలు మంత్రిత్వ పదవులతో లాబీయింగ్ చేస్తున్నారు... రెండు మార్గాల్లోనూ మీరందరూ మిమ్మల్ని మీరు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారు.. ఎంత కాలం పాటు మీరు ప్రజలను పిచ్చివాళ్లను చేస్తారు? ఇక పరిపాలన ఎప్పుడు ప్రారంభిస్తారు?’ అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. బల నిరూపణకు ముందే యడ్యూరప్ప రాజీనామా చేసిన అనంతరం కూడా ప్రకాశ్ రాజ్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆట మొదలవ్వకుండానే ముగిసిందంటూ యడ్యూరప్ప రాజీనామా, కర్ణాటక రాజకీయాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. కర్ణాటకకు కాషాయరంగు అంటుకోలేదు... కానీ రంగులమయంగానే కొనసాగబోతోంది. ఆట మొదలవ్వకుండానే ముగిసింది... 56 గురించి మర్చిపోండి... 55 దగ్గరే ఆగిపోయింది. ప్రియమైన ప్రజలారా మురికి రాజకీయాల కోసం సిద్ధంకండి. అలాగే ప్రజల కోసం నిలబడతాను... పోరాటం కొనసాగుతుందన్నారు. 

Related Posts