YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాలతో ముగిసిన మార్కెట్లు

లాభాలతో ముగిసిన మార్కెట్లు
మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. ప్రధానంగా హెల్త్‌కేర్‌, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌లో ఊపందుకున్న కొనుగోళ్లతో మార్కెట్లు రికవరయ్యాయి. అధిక భాగం నష్టాల మధ్యే కదిలిన మార్కెట్లు చివర్లో న‌ష్టాల‌ను చాలా వ‌ర‌కూ త‌గ్గించుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సరికి బీఎస్ఈ సెన్సెక్స్ 19.41(0.05%) పాయింట్లు క్షీణించి 35,443.67 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ పాయింట్ల 0.70(0.01%) న‌ష్టంతో 10,767 వ‌ద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 10,700కు పైనే ఉండ‌టం విశేషం. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో స‌న్ ఫార్మా(8.13%), డాక్ట‌ర్ రెడ్డీస్(4.92%), టాటా మోటార్స్(1.56%), ఎస్బీఐఎన్(1.28%), రిల‌య‌న్స్(1.24%) ఎక్కువ‌గా లాభాల్లో దూసుకెళ్ల‌గా, మ‌రో వైపు ప‌వర్ గ్రిడ్(2.12%), హెచ్‌డీఎఫ్‌సీ(1.74%), యాక్సిస్ బ్యాంక్(1.05%), ఐటీసీ(0.98%), ఏసియ‌న్ పెయింట్స్(0.97%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి. 

Related Posts