YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అడ్డూ అదుపు లేకుండా ఇసుక దోపిడి

అడ్డూ అదుపు లేకుండా ఇసుక దోపిడి

నెల్లూరు
వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం రోల్ మోడల్ గా నిలిచింది. వరద బాధితులకు ప్రకటించిన నష్టపరిహారం అద్భుతంగా ఉంది. కేటగిరి వారీగా నష్టపరిహారం ఇస్తున్నారు. పంటలకు, పశువుల నష్టపరిహారం చెల్లించనున్నారు. గతంలో ఎన్నడు ఇలాంటి నష్టపరిహార చెల్లింపు చూడలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది అన్నారు. వరదబదితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడం ఒక చరిత్ర.
నష్టపరిహారం చెల్లింపులు చూసి ప్రతిపక్షాలు ముక్కున వెలు వేసుకుంటున్నాయి. బుడమేరు, ఏలేరు వాగులను చంద్రబాబు ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నతధికారులతో మాట్లాడి సోమశిల జలాశయానికి నీటి విడుదల చేయించాను. నెల్లూరు జిల్లాలోని రెండు జలాశయాల్లో 65 టి.యం.సి నీరు ఉంది. మరొ 15 టి.యం.సి నీరు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
నేడు నెల్లూరు జిల్లాలో 8.5 లక్షల ఎకరాల్లో మెదటి పంట సాగుకు నీరు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వంలొ సాగుకు నీరు అందించలేకపోవడంతో పొలాలు బీళ్లు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలొ జల, వ్యవసాయం శాఖల మంత్రులు దోచుకోవడం, దాచుకోవడం చేశారు. గత ప్రభుత్వంలొ మంత్రులు ఇసుక, మైన్స్ క్వాడ్జి మీద ద్రుష్టి సారించారు. గత ప్రభుత్వంలొ ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా దోపిడీ చేశారని ఆరోపించారు.
అనుమతులు లేకుండా సర్వేపల్లో నియోజకవర్గంలొ ఇష్టనుసారం దోచేశారు. వందల కోట్లు దోపిడీ చేసేసిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారు. దోపిడీ చేసిన వారి పేర్లు బయట పెట్టకపోతే మరొ సత్యాగ్రహం వస్తాది. జిల్లా కలెక్టర్ గనుల దోపిడీ పై ప్రత్యేక విచారణ చేపట్టాలి. నేనె ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని విజిలెన్స్ విచారణ వేయించాను. గత ఇదేళ్లల్లో మైనింగ్ అధికారులుగా ఉన్న వారినే విచారణ అధికారులుగా వేస్తే వస్తావాలు బయటకు రావు. సర్వేపల్లిలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. పదివేలు లంచం తీసుకునే అధికారిని సస్పెండ్ చేసినప్పుడు.. కోట్లల్లో దోపిడీ చేసిన వైసిపీ వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులకు గత అవినీతి పై విచారణకు ఇతర జిల్లాల అధికారులను విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సర్వేపల్లిలో జరిగిన అవినీతి పై ఎ 1 వదిలేసి ఎ 15 పేరు ప్రతిపాదిస్తున్నారని అన్నారు.

Related Posts