YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎంఎస్ఎంఈ కొత్త పాలసీతో సామాజిక న్యాయం ఉప ముఖ్యమంత్రి భట్టి

ఎంఎస్ఎంఈ కొత్త పాలసీతో సామాజిక న్యాయం ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్
ఎంఎస్ఎంఈ కొత్త పాలసీ లో సామాజిక న్యాయం చేకూరుతుంది. దశల వారీగ ఎంఎస్ఎంఈ పెండింగ్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.  బుధవారం జరిగిన ఎంఎస్ఎంఈ భేటీలో అయన పాల్గోన్నారు.
భట్టి మాట్లాడుతూ  ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ పాలసీ లేదు.. ఇది మొదటిసారి ఓ చరిత్ర. ఎంఎస్ఎంఈ ల సమగ్ర అభివృద్ధికి కొత్త పాలసీ లో అన్ని అంశాలను పొందుపరిచారు… పాలసీ అద్భుతంగా ఉంది. రాష్ట్ర , ఎంఎస్ఎంఈ ల అభివృద్ధికి కొత్త పాలసీ దోహదపడుతుందని అన్నారు.
ఎంఎస్ఎంఈ లను అభివృద్ధి చేయాలని మా నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్తాజ్ డెక్కన్ హోటల్ లో సమావేశంలో దిశ నిర్దేశం చేశారు. సీఎం కొత్త పాలసీ తెచ్చారు.  ఎంఎస్ఎంఈ కంపెనీ ల్లో టేక్ ఓవర్ ప్రమాదం లేదు. రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణల కోసం మంత్రి శ్రీధర్ బాబు నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు.

Related Posts