YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

6 లక్షల ఫోన్ నెంబర్స్ , 800 యాప్స్ బ్లాక్

6 లక్షల ఫోన్ నెంబర్స్ , 800 యాప్స్ బ్లాక్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26,
 ఈజీ మనీ కోసం అలవాటు పడిన స్కామర్లు ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నిలువునా దోచేస్తున్నారు. అందుకే, ప్రభుత్వం సైబర్ నేరాల పై ఉక్కు పాదం మోపింది. ఇప్పటికే, వచ్చిన కంప్లైంట్ మరియు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని 6 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ లను డీ యాక్టివేట్ చేయడమే కాకుండా 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్ కూడా చేసింది. వచ్చిన ఫోన్ నెంబర్ నుంచి రాకుండా.. కొత్త కొత్త నెంబర్ల నంచి కాల్ చేస్తూంటారు.  ఫెడెక్స్ కొరియల్ అంటారు.. డిజిటల్ అరెస్ట్ అంటారు.. ఏదేదో చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తూంటారు. ఇక మామూలు మోసగాళ్లకు లెక్కే ఉండదు. ఇలాంటి వారి బారి నుంచి ప్రజల్ని కాపాడటానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎనిమిది వందల ఫ్రాడ్ యాప్స్ తో పాటు.. అరు లక్షల ఫోన్  నెంబర్స్ ను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవన్నీ ఫ్రాడ్ చేస్తున్నాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నిర్దారించింది. అలాగే.. అరవై ఐదు వేల వెబ్ సైట్లను కూడా నిషేధించారు సైబర్ నేరాళ్లు తాము ఎవరో గుర్తు పట్టుకుండా మోసాలు చేస్తున్నారు.ఇందు కోసం యాప్స్, అడ్రస్ లేని వెబ్ సైట్స్ ను పెట్టుకుని స్కాములకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారు. ట్రేడ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ చివరికి డేటింగ్ పేరుతో కూడా ఫోన్లు చేసి స్కామ్ చేస్తున్నారు. ఇలాంటివేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా  ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడిన కేసులు పదిహేడు వేలకుపైగా నమోదయ్యాయి. ఇంకా అనేక మంది పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా పరువు పోతుందని సైలెంట్ గా ఉన్నారు. సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు చేపట్టిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సైబర్ నేరాల కోసం తీసుకు వచ్చిన ది ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) ను రంగంలోకి దించింది. యాక్షన్ లోకి దిగిన ఐ4సి  వింగ్ 6,00,000 లక్షలకు పైగా మొబైల్ ఫోన్ లు మరియు సైబర్ స్కామ్ లకు సహకరిస్తున్నట్లు కనుగొన్న 65,000 లకు పైగా యూఆర్ఎల్ లను కూడా బ్లాక్ చేసింది. ఇది కాకుండా సైబర్ నేరాలకు ఆయువు పట్టుగా ఉన్న 800 పైగా యాప్స్ ను కూడా బ్లాక్ చేసినట్లు, ఒక వార్తా పంస్థ రిపోర్ట్ చేసింది. ఐ4సి  వింగ్ ప్రయత్నంతో దేశంలో విచ్చలవిడిగా పెట్రేగి పోతున్న సైబర్ నేరగాళ్ల రెక్కలు విరిచేలా ప్రభుత్వం చేయగలిగింది. సైబర్ నేరగాళ్ల పై చేసిన పోరాటంలో ది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) కూడా ప్రధాన పాత్ర పోషించింది. 2023 నుంచి ఈ పోర్టల్ పై 1,00,00 కు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కంప్లైంట్ లను అందుకుంది. వీటిలో 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్, 62 వేలకు పైగా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కేసులు నమోదు అయ్యాయిసైబర్ నేరగాళ్లను అణచి వేయడానికి కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ 2018లోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ డివిజన్ ను ఏర్పాటు చేసి ..సైబర్ క్రైమ్  ను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంది. క్రిటికల్ కేసుల్లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి నందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో సాంకేతికంగా అత్యాధునిక శిక్షణ పొందిన వారు ఉంటారు. సైబర్ క్రైమ్స్ ను సహించేది లేదని కేంద్రం ఈ చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నట్లు అయింది. నిజానికి ఈ కొత్త ఫోన్ నెంబర్లు, వెబ్ సైట్ల కన్నా.. ముఖ్యంగా డేటా చోరీ అనేది అత్యంత కీలకమైన సమస్యగా మారింది. మన ఫోన్ నెంబర్లు ఆ స్కామర్లు ఎలా తెలుస్తున్నాయి.. మన ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డుల వివరాలు, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదు వివరాలు కూడా తెలుసుకుని ఫోన్లు చేస్తున్నారు. మన పార్శిల్ ఏదైనా రావాల్సి ఉంటే.. వెంటనే తెలుసుకుని ఆ పార్శల్ లో డ్రగ్స్ ఉన్నాయని ఆరోపణలు చేస్తూ..భయపెడుతున్నారు. ఈ డేటా చోరీని కూడా కేంద్రం నియంత్రిస్తే.. చాలా వరకూ సైబర్ క్రైమ్స్ ఆగిపోయే అవకాశం ఉంది.

Related Posts