హైదరాబాద్
హైదరాబాద్ మీర్పేట్ లోని మిథిలా నగర్, సత్య సాయి నగర్ లో ఇళ్లు నీట మునిగాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేరింది. వరద నీటి కోసం వేసిన పైప్ లైన్లు మూసుకుపోవడంతో నీరు ఇళ్లలోకి చేరింది. గత సంవత్సరం ఎన్నో కోట్లు వెచ్చించి ఎస్ ఎన్ టి పి నాలా పనులు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేపట్టారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం దక్కలేదు.