అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం నిర్వహించేందుకు జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కలెక్టర్, రిజిస్ట్రార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శితో జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు. కృష్ణా జిల్లాలోని 5 ఆస్తులను 6 వారాల్లో వేలం వేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా రూ. 50 కోట్లు విలువైన 10 ఆస్తుల జాబితాను తెలంగాణ సీఐడీ కోర్టుకు సమర్పించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది.