హైదరాబాద్:
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు శుక్రవారం జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు, ఏకకాలంలో 16 చోట్ల సోదాలు జరిపాయి. తెల్లవారుజామునుండి మంత్రి పొంగులేటి, అనుచరులు, వ్యాపార సంస్థల్లో ఈడీ సోదాలు జరిగాయి. జూబ్లీహిల్స్ పొంగులేటి ఇంటి వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉంచి సోదాలు నిర్వహించారు. గత ఎన్నికల సమయంలోను పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది. గతంలోనూ ఈడీ రైడ్స్ పై పొంగులేటి ముందే ఊహించి చెప్యపారు. ప్రస్తుతం జరుగుతున్న ఈడీ రైడ్స్ పై ఇంకా పొంగులేటి స్పందించలేదు. హిమాయత్ సాగర్, ఫామ్ హౌస్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈడీ రైడ్స్ కొనసాగుతునన్నాయి