YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి..!

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి..!

సిద్దిపేట
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.
రైతు ధర్నాలో హరీష్ రావు కామెంట్స్:
ఏదో సామెత అన్నట్టు పాలేవో నీళ్ళేవో తేలాలంటే కొద్దిగా టైం పడుతది. కెసిఆర్  ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండే కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ అర్థమైంది. కెసిఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండే. రైతులకు ఎరువు బస్తా కావాలంటే పొద్దున ఐదు గంటలకు చెప్పు లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేది. రైతులను ఎరువు బస్తాల కోసం లైన్ల నిలబెట్టింది కాంగ్రెస్.కెసిఆర్  ప్రతి ఊరికి ఎరువులను లారీల్లో పంపి రైతులకు అందించారు.కెసిఆర్ రాకముందు కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.కెసిఆర్ వచ్చినంక 24 గంటల కరెంటు ఇచ్చిండు. ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కడుపునిండా రైతులకు కరెంటు ఇచ్చిండు.కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ వచ్చేది. కెసిఆర్ 24 గంటలు కరెంట్ అందించాడు
మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి  ఏదో మీటింగ్ లో అంటున్నారు కేసీఆర్  ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎందుకు వస్తలేదని కరెంట్ అధికారులను అడుగుతుంది.
కేసీఆర్ ఉండంగా ఫార్మరే ఫస్టు. కరోనా వచ్చినప్పుడు  45 రోజులు  లాక్ డౌన్ ఉంటే గవర్నమెంట్ కి రూపాయి ఆదాయం లేదు. ఐనా కేసీఆర్ రేషన్ కార్డు మీద 1500 రూపాయలు ఇచ్చిండు. బియ్యం పంపిండు అందర్నీ ఆదుకున్నాడు.కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు రైతుబంధు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.గవర్నమెంట్ కి ఆమదానం లేకపోయినా ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు కానీ రైతులకు మాత్రం రైతుబంధు ఇచ్చిండు.అది కేసీఆర్కు రైతు మీదున్న ప్రేమ. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? కరోనా లేదు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం లేదు.కెసిఆర్ ఉండగా నాట్లు పడే వరకు రైతుల ఫోన్లలో టింగు టింగ్ అని రైతుబంధు పడేది.ఇప్పుడు నాట్లు అయి, కలుపై, పంటకు మందు కొట్టుడు కూడా అయిపోయింది. పంట కోతకు ఉన్నా, దసరా పండుగ దగ్గరకు వస్తున్నా ఇంకా రైతుబంధు పడలేదు.మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అన్ని వంకర మాటలే కానీ రైతులకు మాత్రం రైతుబంధు వేస్తలేడు రేవంత్ రెడ్డి.రైతుబంధుకు కెసిఆర్ ఉండంగా ఎకరానికి 4000 ఇచ్చిండు. మల్ల గెలిస్తే 5000 ఇస్తానని ఇచ్చిండు. మళ్లీ గెలిస్తే 8000 చేస్తా అన్నాడు గెలిస్తే చేస్తుండే.గ్రెస్ గెలిచి 7,500 రైతుబంధు ఇస్తా అన్నారు. పోయిన యాసంగికి 5000 ఇచ్చిండ్రు. ఈ పంటకు మొత్తానికి ఎగబెట్టారు.రైతులను అప్పుల పాలు చేస్తున్నడు రేవంత్ రెడ్డి. పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది.అబద్దాలు చెప్పి కుంటి సాకులు చెప్పి ఇప్పటిదాకా రైతులకు రైతుబంధు పైసలు ఇవ్వలేదు.రాష్ట్రంలో రైతులను ఆగం చేయడం కాదా? కెసిఆర్ ఒక్క సారి కాదు 11 సార్లు రైతుబంధు ఇచ్చిండు.  
ఊరు ఊరుకి కొనుగోలు కేంద్రాలు పెట్టి టైం కు వడ్లు కొనుడు అయినా, వడ్లను కొన్న పైసలు కూడా మూడు రోజులనే రైతులకు అందించిండు కేసీఆర్.కేసీఆర్ వచ్చినంకనే రైతుల భూముల విలువలు పెరిగినాయి.కెసిఆర్ రాకముందు ఎకరం 5 లక్షలు కూడా పోకపోయేది. కేసీఆర్ వచ్చినంక 24 గంటలు కరెంటు ఇచ్చి చెరువులు మంచిగా చేసి రిజర్వాయర్లు కట్టి  రెండు పంటలు నీళ్లు ఇచ్చి రైతు విలువ పెంచిండు. రైతు విలువతో పాటు రైతు భూమి విలువ కూడా పెరిగింది.
కాంగ్రెస్ వచ్చింది రైతు విలువ తగ్గించింది.రైతుబంధు ఎగపెట్టిండు, 4000 పెన్షన్ ఎగపెట్టిండు, అక్కచెల్లెళ్లకు 2500 ఎగపెట్టిండు, వడ్లకు బోనస్ ఎగపెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏ లు ఎగపెట్టిండు, తులం బంగారం ఎగపెట్టిండు. అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి.ఇప్పటికైనా రైతులని, ప్రజలను మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని నేను డిమాండ్ చేస్తున్నాను.
మీరిచ్చిన హామీలను నెరవేర్చేదాక బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టదు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి.లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం.

Related Posts