హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కు ఆర్బీఐ రెండున్నర లక్షల జరిమానా విధించింది. (ఎటిఎమ్ లు) నెలకొల్పడం, సవరించబడిన పర్యవేక్షక చర్యల చట్టం (ఎస్ఎఎఫ్) కింద బ్యాంక్ పై విధించిన పర్యవేక్షక పరిమితులు, ఎక్స్ పోజర్స్ నియమాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు/నిబంధనలను బ్యాంకు ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించారు. ఈ వ్యవహరంలోతప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లు, తనిఖీ సందర్భంగా సంబంధిత పత్రాలు (రికార్డు) ఇవ్వలేకపోవడం కుడా జరిగిందని భారతీయ రిజర్వు బ్యాంకు జనరల్ మేనేజర్, జోగి మేఘనాథ్ తెలియజేశారు.
రిజర్వు బ్యాంకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు బ్యాంకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా నిజానిజాలు, బ్యాంక్ ఇచ్చిన సమాధానం, మౌఖిక వినతి పరిశీలించిన తరువాత ఈ జరిమానా విధించారు.