ఖమ్మం
నగరంలోని 3 టౌన్ గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీళ్లు రావడంలో వాహనదారులు మండిపడ్డారు. వాహనాలకు పెట్రోల్ కొట్టించగా నీళ్లు వచ్చాయని ఆరోపించారు. బంకు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు బాధితులు. ఇదే బంక్ పై అనేకసార్లు ఫిర్యాదులు వచ్చాయి అంటున్నారు. బంకు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.