YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్, బీఆర్ఎస్.. మధ్య నలిగిపోతున్న టాలీవుడ్

కాంగ్రెస్, బీఆర్ఎస్.. మధ్య నలిగిపోతున్న టాలీవుడ్

హైదరాబాద్, అక్టోబరు 3,
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు క్షమాపణలు చెప్పలేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. సినీ ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు సురేఖ. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ డ్రగ్ మరకలు అంటించారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ రగడ మరో లెవెల్‌కి వెళ్లిపోయింది. మంత్రి కొండా సురేఖ ప్రెస్‌మీట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ సభలో బీజేపీ ఎంపీ రఘునందన్‌ తనకు మెడలో దండ వేస్తే.. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ట్రోల్ చేశారన్నది సురేఖ ఆవేదన. ఆ ట్రోల్ చేసింది కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమేనని ఆరోపించారు. వెంటనే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ట్రోల్‌పై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు కూడా స్పందించారు. ట్రోల్ చేసిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అయితే పోలీసులకు అప్పగించాలని.. లేదంటే ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు.మొదలైన వివాదంపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్వీట్ చేశారు. సురేఖకు కలిగిన అవమానానికి బాధపడుతున్నాను అన్నారు. అయితే కేటీఆర్ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో సురేఖ మరోసారి కేటీఆర్‌పై విమర్శలు చేశారు. విమర్శలు చేసే క్రమంలో సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి లాగారు. ఇండస్ట్రీలో చాలామందికి కేటీఆర్‌ డ్రగ్స్ అలవాటు చేశారన్నారు. ఒకరిద్దరి పేర్లను కూడా ప్రస్తావించారు. కొండా సురేఖ కామెంట్లకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్స్ మొదలయ్యాయి. ఖబడ్దార్.. నాలుక చీరేస్తాం, ఉరికిస్తాం అంటూ రివర్స్ ఎటాక్‌కి దిగారు గులాబీ నేతలు. పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు మాజీ ఎంపీ మాలోతు కవిత. మరోవైపు సురేఖ క్షమాపణ చెప్పకుంటే కోర్టుకెళ్తామన్నారు బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్‌. కాగా, ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. సురేఖతో పెట్టుకోవద్దని సూచించారు. ఇదిలావుంటే, సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున.. ఆమె ఆరోపణలు అసంబద్ధం, అబద్దం అని కొట్టిపారేశారు. ఇక ఏపీలో లడ్డూ వివాదంపై వరుస ట్వీట్‌లతో హీట్ పుట్టిస్తున్న ప్రకాష్‌ రాజ్‌.. తెలంగాణలో ఏంటీ రాజకీయాలని ప్రశ్నించారు. సినిమా వాళ్ళ పై కొండా సురేఖ ఇలాంటి కామెంట్స్ చేయడం క్యారెట్ కాదు అంటూ పలువురు సినీ ప్రముఖులు అన్నారు. సినిమా వాళ్ళను రాజకీయాల్లోకి లాగొద్దు అంటూ చాలా మంది స్పందించారు. సమంత విడాకుల పై కొండా సురేఖ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో సమంత స్పందించింది. నా వ్యక్తిగత జీవితం అంటే అంత చిన్న చూపా.? నా విడాకులు సామరస్యంగా జరిగాయి. నేను రాజకీయాలకు అతీతంగా ఉంటాను అంటూ సమంత కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత కొండా సురేఖ కామెంట్స్ పై.. నాగార్జున స్పందిస్తూ..” మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను” అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అలాగే ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. అంటూ ఫైర్ అయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. అలాగే నాని కూడా రియాక్ట్ అయ్యారు..”మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది” అని నాని అన్నారు. “మేం మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేము” అని సీనియర్ నటి ఖుష్బూ అన్నారు. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ మాట్లాడుతూ..ఇండస్ట్రీలో పని చేసే అడవాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని హేమ అన్నారు. సినిమా వాళ్లంటే అంత చిన్న చూపా అంటూ ట్వీట్ చేశారు.మొత్తానికి కొండా సురేఖపై ఎవరు ట్రోల్ చేశారో.. ఎక్కడి నుంచి పోస్ట్ చేశారో తెలియదు.. కానీ ఇద్దరి మధ్య రాజకీయం సినిమా ఇండస్ట్రీని నలిగిపోయేలా చేస్తోంది.

Related Posts