YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్

పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్

మహబూబ్ నగర్, అక్టోబరు 3,
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచడంతో తెలంగాణలో పామాయిల్ రైతుల పంట పండింది. పామాయిల్ గెలల ధర అమాంతం రూ. 2651 వేలు పెరిగి రూ.17 వేలకు చేరింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.పామాయిల్ రైతులకు అధిక ధరను అందించి, రాష్ట్రంలో ఆయిల్ పామాయిల్ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఉద్ధేశంతో ముడిపామాయిల్ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామాయిల్ రైతులను ఆదుకొనేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ని కోరిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముడి పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 5.5 % నుంచి 27.5 % కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ముడి పామాయిల్ గెలల ధర రూ. 14,392 నుంచి అమాంతం రూ. 2651 పెరిగి ప్రస్తుతం రూ. 17,043 చేరుకుంది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.ఫలితంగా రైతులకు ఈ నెలలో అదనంగా రూ. 12 కోట్ల లబ్ధి చేకూరనుంది. గతంలో ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడం వల్ల ఆయిల్ పామ్ గెలల ధర తగ్గి రైతులు నిరాశ పడడమే కాకుండా కొత్తగా ఆయిల్ పామ్ సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపించిందని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఇటీవల మన రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఈ విషయంపై మంత్రి తుమ్మలతో పాటు ఆయిల్ పామ్ రైతులు కూడా ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి చొరవతో సెప్టెంబర్ 13 న కేంద్ర ప్రభుత్వం ముడిపామ్ ఆయిల్ దిగుమతిపై సుంకాన్ని 5.5 % నుండి 27.5 % కు పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం రాష్ట్రంలో 44,444 ఎకరాల పామ్ ఆయిల్ తోటల నుంచి సాలీన 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి వస్తోంది. ఈ ధరల పెరుగుదల వల్ల 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరుతుంది. పామ్ ఆయిల్ దిగుమతిపై భారత ప్రభుత్వానికి సంవత్సరానికి 80 వేల కోట్ల రూపాయల విదేశి మారక ద్రవ్యం ఖర్చవుతుందని, దిగుమతి సుంకాలు విధించడం వలన దేశంలోని పామ్ ఆయిల్ రైతులు, ముఖ్యంగా తెలంగాణ పామ్ ఆయిల్ రైతులు ప్రయోజనం పొందుతారని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గెలల ధరల పెరుగుదల వల్ల నూతనంగా రైతులు పామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపే అవకాశం ఏర్పడనుందని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ ప్రభుత్వం (31) జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు (14) కంపెనీలకు అనుమతులివ్వడంతో, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.23 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్ సాగు వైపు చూసే అవకాశం ఉందని, కావునా ఆయిల్ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. పామ్ ఆయిల్ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పామాయిల్ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Related Posts