YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొండ సురేఖకు లీగల్ నోటీసు పంపిస్తా నాగార్జున

కొండ సురేఖకు లీగల్ నోటీసు పంపిస్తా నాగార్జున

హైదరాబాద్
మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు అక్కినేని నాగార్జున పంపనున్నారు. ప్రస్తుతం వైజాగ్లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని వెల్లడించారు. కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని అన్నారు

కొండ సురేఖ మాటలు చట్టవిరుద్దం ఆమెపై కేసు వేస్తా  కేఏ పాల్
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి, పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్టు ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ కే ఏ పాల్ అన్నారు. ఆమె మాటలు చట్టవిరుద్ధం. ఇదే అమెరికా అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారు. రాహుల్ గాంధీ ఒక వ్యాఖ్య చేస్తే ఆయన పార్లమెంటు సభ్యత్వమే పోగొట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోల్చితే కొండా సురేఖ వ్యాఖ్యలు 100 రెట్లు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆమెకు నోటీసులు ఇచ్చి డీజీపీ ఎందుకు అరెస్టు చేయలేదు? ఇప్పుడు సారీ చెప్తే.. హత్య చేసి సారీ చెప్పినట్టుగా ఉంది. సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన ఉంటాయో ఊహించారా? కొండా సురేఖ రాజీనామా చేయాలి. 72 గంటల సమయం ఇస్తున్నా. లేదా తక్షణమే ఆమెను తొలగిస్తూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలి. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువై నేతలు ఇలా వ్యవహరిస్తున్నారు. కళ్ళు నెత్తిమీద ఉన్నాయని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదానిని ఎందుకు కలిశారు? ఆ సమావేశంలో సునీల్ కనుగోలు ఎందుకు ఉన్నాడు?ప్రజలకు కూడా బుద్ధి లేదు. రూ. 5,000/- తీసుకుని ఓట్లు వేస్తున్నారు. ఇకనైనా ఓటర్లు ఆలోచనతో ఓటేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. మార్పు రావాలి. కాంగ్రెస్ వద్దు అంటే మళ్ళీ కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు జనం.  మళ్లీ వాళ్లను ఎందుకు తీసుకురావాలి? అందరూ ఒకటే నని అన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే.. ప్రజాశాంతి పార్టీని గెలిపించాలి. లేదంటే ప్రజలే నష్టపోతారు. 60% ప్రజలు ఉన్న బీసీలకు నేనున్నాను. నాతో క్రిస్టియన్ మైనారిటీలు ఎలాగూ ఉన్నారు. 72 గంటల్లో రాజీనామా చేయకపోతే.. కొండా సురేఖ పై కేసు దాఖలు చేస్తా. రాహుల్ గాంధీ ఏఏ సెక్షన్ల ప్రకారమైతే తన పదవిని పోగొట్టుకున్నారో వాటిని మించి కొండా సురేఖపై కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కొండా సురేఖ రాజీనామా చేసినా.. లేదా ఆమెను పదవి నుంచి తొలగించినా... నాకు ఒక కేసు మిగులుతుంది. హైడ్రా విషయంలో వ్యతిరేకత పెరుగుతుందని ప్రజల దృష్టి మళ్లించేందుకు కొండా సురేఖతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయించారేమోనని అయన అనుమానం వ్యక్తం చేసారు.

Related Posts