YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇప్పటి వరకు 188 మంది మావోయిస్టులు హతం

ఇప్పటి వరకు 188 మంది మావోయిస్టులు  హతం

బీజాపూర్
ఈ యేడాది లో ఇప్పటివరకు 188 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో హతమయ్యారు. 212 మందికి పైగా నక్సలైట్లను అరెస్టు చేసినట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్రాజ్ పి తెలిపారు. 201 మంది నక్సలైట్లు కూడా లొంగిపోయారు. 10 రోజుల క్రితం, సెప్టెంబర్ 24న, సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఘటనలో  ఇద్దరు నక్సలైట్లు మరణించారు. అయితే ఇద్దరి మృతదేహాలను సహచరులు ఎత్తుకెళ్లారు.
మార్చి 20న దంతెవాడలో ఓ మహిళ సహా ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. మార్చి 27న బీజాపూర్లో నక్సలైట్ డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు. ఏప్రిల్ 3న బీజాపూర్లోని కోర్చోలి ఎన్కౌంటర్లో ఒక మహిళతో సహా 13 మంది నక్సలైట్లు మరణించారు.  ఏప్రిల్ 6న తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు. ఏప్రిల్ 16న కంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది నక్సలైట్లు మరణించారు. వీరిలో 15 మంది మహిళలు ఉన్నారు.  ఏప్రిల్ 30న, నారాయణపూర్లోని సిజి-మహారాష్ట్ర సరిహద్దులో 10 మంది నక్సలైట్లు మరణించారు.  వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
మే 10న బీజాపూర్ జిల్లాలోని పీడియాలో ఇద్దరు మహిళలు సహా 12 మంది నక్సలైట్లు మరణించారు. మే 25న సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ముగ్గురు నక్సలైట్లు హతమయ్యారు.  జూన్ 8: అబుజ్మద్లోని అమ్దాయ్ ప్రాంతంలో ఆరుగురు నక్సలైట్లు హతమయ్యారు.  జూన్ 14-15 తేదీల్లో అబుజ్మద్లో నలుగురు మహిళలు సహా 8 మంది మావోయిస్టులు మరణించారు. జూలై 19న దంతెవాడలో మహిళా నక్సలైట్ హత్యకు గురయ్యారు. ఆగస్టు 31న నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించారు. సెప్టెంబర్ 3న దంతెవాడలో 6 మంది మహిళలు సహా 9 మంది నక్సలైట్లు హతమయ్యారు. సెప్టెంబర్ 5న సిజి-తెలంగాణ సరిహద్దులో ఇద్దరు మహిళలు సహా 6 మంది మావోయిస్టులు మరణించారు. సెప్టెంబర్ 24న సుక్మా జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. అక్టోబర్ 4న నారాయణపూర్-దంతేవాడలో ఇప్పటివరకు 36 మంది నక్సలైట్లు హతమయ్యారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది

Related Posts