మంథని
మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్యాస్ సబ్సిడీ పేపర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవల గురించి, జరుగుతున్న అభివృద్ధి గురించి, ప్రజలకు అందిస్తున్న సబ్సిడీల గురించి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దోరగొర్ల శ్రీనివాస్ యాదవ్, చేమంతుల ఓదెలు, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పుట్ట సుధాకర్, పెగడ రాజు లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.