YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో దళితులకు రక్షణ లేదు

తెలంగాణలో దళితులకు రక్షణ లేదు
తెలంగాణలో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జాతీయ స్థాయిలో అన్ని పార్టీ అధ్యక్షులను కలుస్తున్నాం. జాతీయ స్థాయిలో ఉన్న 106 దళిత ఎంపీలను ఎకం చేస్తున్నాం. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత ఎంపీ లతో తెలంగాణలో పెద్ద ఎత్తున దళిత గిరిజన సభ ఎర్పాటు చేయ్యబోతున్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు అన్యాయం చేస్తున్నాయి. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు, రోజుకో విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. తెలంగాణా ఉద్యమంలో అన్ని కూలాల విద్యార్థులు చనిపోయారు. జైలుకు పోయారు. కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు జైలుకు పోయారా అని ప్రశ్నించారు. విద్యార్థులు చని పోతుంటే వారి తల్లిదండ్రులు గుండె కోత అర్థం చేసుకోని తెలంగాణ ఇచ్చింది. తెలంగాణలో పేదలను, దళితులను అణచివేస్తున్నారు. రానున్న కాలంలో దళితులు భాగా బుద్ది చేప్తారని అయన అన్నారు. 

Related Posts