YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేశ రక్షణ విషయంలో రాజీ పడోద్దు

దేశ రక్షణ విషయంలో రాజీ పడోద్దు

దేశ రక్షణ విషయంలో రాజీ పడోద్దు వీఎల్ఎఫ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
వికారాబాద్ పూడూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్,ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందింది. కొందరు వీఎల్ఎఫ్ ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీఎల్ఎఫ్ తో  ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం.. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల మోసం  వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి. 2 017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి  నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్ నాథ్ సింగ్ అడగగానే మేం కొనసాగించాం దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించా. పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు... దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి. వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని అన్నారు.
ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి విజ్ఞప్తి చేస్తున్నా.ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతున్నా. ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరుతున్నా. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కోరుతున్నానని అన్నారు.

దేశ రక్షణ విషయంలో కేంద్రం కట్టుబడి వుంది కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
విఎల్ఎఫ్  ప్రాజెక్ట్ మన దేశానికి అత్యంత ఉపయోగకరమైనది. నేడు అబ్దుల్ కలాం జయంతి ఈ రోజు శంకుస్థాపన పనులు ప్రారంభించదం హర్షణీయమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్కి కృతజ్ఞతలు. దేశం భద్రత రక్షణ విషయంలో రాజకీయాలు చేయడం లేదని అన్నారు. దేశం యొక్క బలమైన మరియు భద్రత కోసం ఈ రకమైన స్టేషన్లు మన దేశానికి అత్యంత ముఖ్యమైనవి.  పూర్వం కమ్యూనికేషన్ మరియు సమాచారం కోసం ఈగల్ మరియు ఇతర పక్షులను ఉపయోగించాము.   ఇతర కమ్యూనికేషన్లను వ్యవస్థను బలోపేతం చేస్తు ఉపయోగిస్తున్నాము.  కమ్యూనికేషన్ వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తున్నాము.  గత ముప్పై సంవత్సరాల నుండి మన దేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. దేశం బలమైన మిలిటరీని నిర్మించడానికి కట్టుబడి ఉందని అన్నారు.
కొందరు వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ గురించి తప్పుడు సమాచారాన్ని సృష్టిస్తున్నారు.  మరియు పర్యావరణానికి నష్టం జరిగిందని అంటున్నారు.  ఈ ప్రాజెక్ట్ పర్యావరణానికి హాని కలిగించదని  చెబుతున్నాను. కొంతమందికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు.  దేశ రక్షణ భద్రత విషయంలో  కేంద్రం మరింత కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.

Related Posts