YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తాడిపత్రిలో రంజాన్ తోఫా పంపిణి

తాడిపత్రిలో రంజాన్ తోఫా పంపిణి
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని టైలర్స్ కాలనీలో రంజాన్ పండుగను పురస్కరించుకుని రంజాన్ తోఫా పథకం ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జె.సి.ప్రభాకర్ రెడ్డి  హాజరైయ్యారు.  ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  వాటిని అధిగమిస్తూ బడుగు,బలహీన, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారని అన్నారు. ముస్లిం మైనార్టీలంటే చంద్రబాబుకు  అమిత ప్రేమ. రంజాన్ పండుగను ప్రతిపేద ముస్లిం కుటుంబం ఆనందంగా జరుకోవాలని ఈ రంజాన్ తోఫా పథకాన్ని అమలుచేస్తున్నారన్నారు. రంజాన్ తోఫాపథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ముస్లిం కుటుంబానికి 5కేజీల గోధుమపిండి,2 కేజీల చక్కెర,1 కేజీ సేమియా ప్యాకెట్,100గ్రాముల నెయ్యిని పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వీ. రవీంద్రారెడ్డి,మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ భోగాతి నారాయణరెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మ, సీఎస్డీటి రాజశేఖర్, ఆర్ఐ మల్లేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పద్మావతి,నూర్జహాన్, లక్ష్మీదేవి,మాజీ కౌన్సిలర్ హాజీపీర, పట్టణ మైనార్టీ సెల్ ప్రధానకార్యదర్శి హాజి బాష, ఓబిరెడ్డి, శంకరయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Related Posts