YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సికింద్రాబాద్ లో ఉద్రిక్తత, లాఠీ చార్జ్

సికింద్రాబాద్ లో ఉద్రిక్తత, లాఠీ చార్జ్

సికింద్రాబాద్
సికింద్రాబాద్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలమ్మ ఆలయం లో విగ్రహం ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన హిందూ సంఘాల కార్యకర్తలు, పోలీసుల మధ్య గొడవ మొదలైంది. దీంతో ఆందోళన కారులను చెదరగొట్టేందుకు పోలీసు లు లాఠీచార్జ్ చేశారు.కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఓ ఆగంతకు డు ధ్వంసం చేశాడు. కాళ్లతో తన్ను కుంటూ లోనికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని పడగొట్టాడు. ఆలయం గద్దెపైకి ఎక్కి మరింత ధ్వంసానికి పాల్పడుతుండగా.. స్థానికులు పట్టుకుని కొట్టి పోలీసులకు అప్ప గించారు. ఈ వీరంగమంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. కాగా, దీంతో ఆగంతకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ముత్యాలమ్మ ఆలయంపై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిర సన తెలిపాయి. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. తమను అడ్డుకోవడంతో ఆందోళనకారులు పోలీసులపై చెప్పులు, కుర్చీలు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీ సులు లాఠీ ఛార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related Posts