YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయానికి గండి

జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయానికి గండి
నేచురల్ గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని జీఎస్టీ కౌన్సిల్  సెక్రటరీ పత్రికా ప్రకటనలు చేయడం సరికాదని  ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. దేనినైనా జీఎస్టీ పరిధిలోకి తేవాలంటే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నాక జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. నేచురల్ గ్యాస్ పై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోకుండా అన్ని రాష్ట్రాలు సమ్మతితో నిర్ణయం తీసుకోబోతున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ సెక్రటరీ ఎలా చెబుతారని అయన ప్రశ్నించారు. 2017-18 లో నేచురల్ గ్యాస్ ద్వారా రాష్ట్రానికి రూ.523 కోట్లు ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తేవడం వల్ల రాష్ట్రాలకు ఆదాయ వనరులు స్వయప్రతిపత్తిని కోల్పోయాయి.. నేచురల్ గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఆంద్రప్రదేశ్ కు రావాల్సిన ఆదాయం కోల్పోతుంది. నేచురల్ గ్యాస్ పై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోకుండా జీఎస్టీ పరిధిలోకి తెస్తామని జీఎస్టీ సెక్రటరీ ఈ విధమైన ప్రకటనలు చేయడం వల్ల వ్యాపారస్తుల్లో గందరగోళం ఏర్పడుతుందని అయన అన్నారు.

Related Posts