YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు
నైరుతి రుణపవనాల రాకతో బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని, ఈ నేపథ్యంలో రానున్న 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా కోస్తా తీరం వెంట 40-50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. 
ఈ సమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ, దక్షిణ కోస్తా మీదుగా ఉత్తర కోస్తా వైపు విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం నుంచే ఉత్తర కోస్తా అంతటా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. 
వాయు‘గండం’: పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి, ఆదివారానికి వాయుగుండగా మారే అవకాశాలున్నాయని తెలిపారు. ఇది బంగ్లాదేశ్ వద్ద తీరందాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
అలలు ఉధృతం: వాయుగుండం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, భారీ అలలు ఎగసిపడతాయని హెచ్చరించారు. సముద్రం నుంచి నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తాయన్నారు.
తెలంగాణలోనూ..: రుతుపవనాలు తెలంగాణలో సైతం విస్తరించాయని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో ఈ నెల 14 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

Related Posts