YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

టీం ఇండియాకు ఫిట్ నెస్ టెస్టు

టీం ఇండియాకు ఫిట్ నెస్ టెస్టు
భారత జట్టు మళ్లీ యో-యో ఫిట్నెస్ టెస్టుని ఎదుర్కోబోతోంది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే ముందు ఈ టెస్టుని ఎదుర్కొన్న టీమిండియా క్రికెటర్లు.. తర్వాత ముక్కోణపు టీ20 సిరీస్, ఐపీఎల్ 2018 సీజన్లో ఆడారు. రానున్న గురువారం నుంచి బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో క్రికెటర్లకి మరో రెండు రోజుల్లోనే ఈ ఫిట్నెస్ టెస్టుని పూర్తిచేయనున్నట్లు తెలుస్తోంది. 
కఠినమైన ఈ యో-యో టెస్టులో ఏ క్రికెటర్ విఫలమైనా.. అతడికి తుది జట్టులో చోటు దక్కడం అనుమానమే. అఫ్గానిస్థాన్తో టెస్టు మ్యాచ్లోనే కాదు.. తర్వాత ఐర్లాండ్తో టీ20 సిరీస్, ఇంగ్లాండ్ పర్యటన ఉండనున్న నేపథ్యంలో.. ఈ ఫిట్నెస్ టెస్టులో ఫెయిలైన క్రికెటర్లు మరో మూడు నెలలపాటు భారత తరఫున మ్యాచ్లు ఆడే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. గత ఏడాది యో-యో టెస్టులో ఫెయిలవడంతోనే స్టార్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా సైతం కొన్నినెలలు టీమిండియాకి దూరమయ్యారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకి ముందు రైనా పాసైనా.. యువీ మాత్రం ఇప్పటికే రెండుసార్లుకిపైగా ఈ టెస్టులో విఫలమయ్యాడు. రెండు నెలలు సుదీర్ఘంగా ఐపీఎల్ ఆడిన భారత క్రికెటర్లలో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వారు మళ్లీ ఫిట్నెస్ సాధించినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. యో-యో టెస్టు ముగిసే వరకూ ఎవరి ఫిటెనెస్పైనా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. 

Related Posts