YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో తప్పిన పెనుప్రమాదం

స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో తప్పిన పెనుప్రమాదం
తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. స్పీకర్ కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. భూపాలపల్లి జిల్లా గణపురంలో స్పీకర్ మధుసూదనాచారి రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పర్యటనను ముగించుకుని తిరిగి వస్తుండగా దేవాదుల పైపులను తీసుకువస్తున్న రెండు లారీలు ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయ్ వాహనాలను ఢీకొట్టాయి. బలంగా ఢీకొట్టడంతో వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అంత‌కుముందు గణపురం మండల కేంద్రంలో స్పీకర్ మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి నాగలి పట్టి దుక్కిదున్నారు. అప్రమత్తమైన పోలీసులు స్పీకర్‌ను క్షేమంగా గమ్యానికి చేర్చారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం నుజ్జనుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే మంత్రులు.ప్రజాప్రతినిధులు స్పీకర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు.

Related Posts