YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ స్థాయి జగన్ కు లేదు

ఆ స్థాయి జగన్ కు లేదు
నవనిర్మాణ దీక్ష, మహాసంకల్ప కార్యక్రమాలు విజయవంతం చేసిన అధికారులకు కృతజ్ఞతలు.  5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మేరకు కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు పోరాటం చేస్తున్నారని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు.  చంద్రబాబుకు ప్రజల మద్దతు చూసి ప్రతిపక్ష వైసీపీకి దిమ్మతిరిగింది.  ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక నేరగాడు వైఎస్ జగన్, చంద్రబాబుపై విమర్శలు చేసే స్థాయి జగన్ కు లేదని అన్నారు.  రాష్ట్ర ప్రజలకు నిజాయితీగా సేవ చేస్తున్న చంద్రబాబుపై చార్జిషీటు రిలీజ్ చేయడం సిగ్గుచేటు.  పుట్టుక నుంచి మహా ప్రస్థానం వరకు ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేవని అన్నారు.  దేశంలోనే 38 అభివృద్ధి గ్రామాలను ఎంపిక చేస్తే వాటిలో 18 గ్రామాలు ఏపీకి చెందినవి.  మంత్రి లోకేష్ నేతృత్వంలో పంచాయితీలు విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి.  ఎంపీల రాజీనామాలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు, వాటి ఆమోదానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.  టీడీపీని తిట్టడానికి తప్పితే రాజీనామాలు మీకు ఇంక ఏ విధంగా ఉపయోగపడదు.  అబద్ధాల కోరు జగన్ రాక ఇష్టం లేక సింహాచలం వద్ద తేనెటీగలు అడ్డుకున్నాయి.  బీజేపీ, వైసీపీ కలిసి ఆంధ్రుల ఆత్మగౌరవంతో అడుకుంటున్నాయి. 

Related Posts