భద్రాద్రి కోత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరావు సోమవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు గర్భగుడి,ఉప ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు మంత్రులకు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేస్తుందని...అందులో బాగంగా పుణ్యక్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ అభివృద్ధి పనులకు సియం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ భద్రాచల ఆలయ అభివృద్ధికి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలియజేశారు..