దళితుల పై దాడులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చటం మరింత బలపర్చాలి. దేశం లో దళితులు బానిసల కంటే దారుణంగా చూడబడుతున్నారుని మాజీ లోక్సభ స్పీకర్ మీరాకుమార్ ఆరోపించారు. చట్టం బలపర్చడం లో బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని ఆమె విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని, తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని, దళితులకు పాలించే అర్హత లేదా అంటూ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి దళితుడైన రాజయ్యను తొలగించారని, అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే సంపత్ను అకారణంగా ఎక్స్పెల్ చేశారని మండిపడ్డారు. ఇది రాజ్యంగాన్ని కుని చేయడమే. తెలంగాణ తో నాకు ఉన్న సన్నిహిత్యాని ఎలక్షన్ పాలిటిక్స్ తో ముడిపెట్టలేమని ఆమె అన్నారు.