YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కొలంబస్ నగరంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు

కొలంబస్ నగరంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు
కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు అమెరికాలోని కొలంబస్ నగరంలో ఘనంగా జరిగాయి. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలితో మొదలైన ఈ సంబురాల్లో తెలంగాణ ఆటపాటలు అందరినీ అలరించాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా బతుకమ్మ ఆటలు,బోనాల నృత్యం అతిథులందరినీ అలరించాయి. సంబురాల్లో భాగంగా ఫ్యాషన్ షో నిర్వహించారు.నేతన్నలు తయారు చేసిన కాటన్ దుస్తులతో ఈ ఫ్యాషన్ షోను నిర్వహించారు. ఈ సంబురాల్లో ప్రముఖ తెలుగు నటి ప్రజ్ఞా జైస్వాల్, సింగర్ కౌసల్య, మిమిక్రి రమేశ్‌ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ పోకల మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో ఎన్‌ఆర్‌ఐలు భాగస్వాములు కావాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణ ప్రజల కలను సాకారం చేయడానికి ఎన్‌ఆర్‌ఐలు ముఖ్య భూమిక పోషించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డబ్లిన్ మేయర్ స్టువర్ట్ హారిస్, వరంగల్ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు హాజరయి ప్రసంగించారు.రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యమైన పాత్ర పోషించారన్నారు. దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు శ్రీధర్ బిల్లకంటి, అమర్ మూలముళ్ల, అశోక్ ఇల్లందుల, శ్రీకాంత్ గడ్డం, అనిల్ వాది, సజిత్ దేశినేని, శ్రవణ్ చిదురుప్పా, శ్రీనివాస్ సలాంద్రి, అనిల్ దండపనేని, బాల లబ్బిశెట్టి, శ్రీనివాస్ కొంపల్లి, రమేశ్, మధు, వెంకట్ తాళ్లపల్లి,శ్రీనివాస్ ఆకుల రామకృష్ణ, విక్రమ్, శ్రావణి,మహేశ్ పోకల, వేణు కంజర్ల, రోహిత్, కమల్, రజనీకాంత్, వంశీ, ధాకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts