ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన తప్పుడు విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం తెలిపారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు చక్రాలపై నడిచే ఆర్థిక వ్యవస్థను మోదీ పంక్చర్ చేశారని విమర్శించారు. నాలుగింటిలో మూడు టైర్లు అయిన ఎగుమతులు,ప్రైవేటు పెట్టుబడులు,ప్రైవేటు వినయోగం దారుణంగా దెబ్బతిందన్నారు. వాణిజ్య,వ్యాపారవేత్తలను జీఎస్టీ వేధిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు దేశ ప్రజలపై ఇంకా ప్రభావం చూపిస్తోందన్నారు. వివిధ వర్గాల ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి ఉందని,రైతులకు గిట్టుబాట ధర లభించడం లేదని,యువత ఉద్యోగాలు లేక తల్లడిల్లుతున్నారని చిదంబరం విమర్శించారు.