YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోదావరికి పూజలు చేసిన వైఎస్ జగన్

గోదావరికి పూజలు చేసిన వైఎస్ జగన్

వైయస్సార్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు దశకు చేరుకుంది.. ఈరోజు మధ్యాహ్నం పశ్చిమలో పాదయాత్ర ముగించుకుని తూర్పుగోదావరి జిల్లా కు జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం గోష్పాద క్షేత్రం లో ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో ఆయన గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య జగన్ గోదావరి మాత కు హారతినిచ్చారు. అనంతరం శివాలయాన్ని దర్శించుకొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు శ్రీ వైయస్ జగన్ను ఆశీర్వదించారు. ఆయన పాటు పార్టీ సీనియర్ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ, జిల్లా నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts