YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సుందిళ్ల బ్యారేజీ పనులపై మంత్రి హరీశ్రావు సమీక్ష

సుందిళ్ల బ్యారేజీ పనులపై మంత్రి  హరీశ్రావు సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి హరీశ్రావు మంగళవారం నాడు పరిశీలించారు. తరువాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులపై ఇంజినీర్లు, గుత్తేదారులతో హరీశ్రావు సమీక్షించారు. పనులు ఎక్కడివరకు వచ్చాయన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ పనుల ప్రణాళికపై కూడా సమీక్షించిన మంత్రి హరీశ్రావు రోజు వారీ పని ప్రణాళికతో లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాజెక్టు నిర్మాణం జరగని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన జరుగుతుందన్నారు. అన్ని అనుమతులు లభించిన ప్రాజెక్టు పనులు మూడు షిఫ్ట్లలో బ్యారేజీ, పంప్హౌస్, టన్నెల్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే సాగు, తాగునీటి కష్టాలు దూరమవుతాయన్నారు. పనుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వర్షం కారణంగా పనులకు కొద్ది సమయం ఆటంకం ఏర్పడుతుంది. దీన్ని అధిగమించడానికి రాష్ట్రంలోని ఏజెన్సీలతో మాట్లాడి కార్మికులను పెంచాలని అన్నారు. 

Related Posts