హైదరాబాద్
మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యాసంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. ఇటీవల ఈ కిచెన్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఈ కిచెన్ నుంచే గ్రేటర్ హైదరాబాద్లోని చైతన్య కాలేజీల హాస్టళ్లకు ఫుడ్ సరఫరా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వేల మందికి భోజనం తయారుచేస్తున్న కిచెన్ అపరిశుభ్రంగా ఉండడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మండిపడ్డారు. కిచెన్లో పాడైపోయిన ఆహార పదార్థాలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు అధికారులు మాదాపూర్(ఖానామెట్)లోని చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు.