
హైదరాబాద్, ఫిబ్రవరి 11,
విశ్వంభర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు దర్శకుడు వశిష్ట. మరోవైపు విశ్వంభర పూర్తి కాగానే.. రెండు సినిమాలు లైన్లో పెట్టారు చిరంజీవి. అనిల్ రావిపూడి రేసులో ముందున్నారు.
మే నుంచే ఈ కాంబినేషన్ సెట్స్పైకి రానుందని నిర్మాత సాహు గరపాటి క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసారు. చిరంజీవితో ఎప్పట్నుంచో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు అనిల్.నిజానికి సంక్రాంతికి వస్తున్నాం కథ ముందుగా చిరుకే చెప్పారు అనిల్. అయితే అది మెటీరియలైజ్ కాలేదు. ఇప్పుడన్నీ కుదిరాయి.. బాస్తో పక్కా మాస్ సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి.విశ్వంభర విడుదలైన ఆర్నెళ్ళలోపే అనిల్, చిరు సినిమా కూడా రానుంది. అంటే ఫ్యాన్స్కు డబుల్ బొనాంజా అన్నమాట. 2025 సెకండాఫ్లో విశ్వంభర.. 2026 సంక్రాంతికి అనిల్ సినిమాలతో రానున్నారు చిరంజీవి.శ్రీకాంత్ ఓదెల సినిమా సైతం వచ్చే ఏడాదే రానుంది. నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్న ఓదెల.. దీని తర్వాత మెగా ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నారు. అంటే ఏడాదిన్నర గ్యాప్లోనే 3 సినిమాలతో రాబోతున్నారు మెగాస్టార్. పైగా మూడు కుర్ర దర్శకులతోనే..