
సిద్దిపేట
బీఆర్ఎస్ కీలక నేత మాజీమంత్రి హరీష్ రావు త్వరలో పాదయాత్ర చేయనున్నారు. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద హరీష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులపాటు 130 కి. మీ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆయా గ్రామాల్లో రోజుకో సభ నిర్వహిస్తారు కాగా చివరి రోజు సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.