YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైల్వేకు కలిసొచ్చిన వాటర్ బిజినెస్

రైల్వేకు కలిసొచ్చిన వాటర్ బిజినెస్

హైదరాబాద్, ఫిబ్రవరి 14, 
ప్రస్తుతం రైల్ నీర్ నీటిని రూ.15 లీటర్ ధరకు అందిస్తున్న ఐఆర్సీటీసీ, దీనివల్ల భారీగా ఆదాయం ఆర్జిస్తోంది. రోజూ 14 లక్షల నీటిబాటిళ్ల ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ, 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 39.5 కోట్ల విలువైన బాటిళ్లను ఉత్పత్తి చేసింది. ఈ బాటిళ్ల అమ్మకాలను చూస్తే, ప్రతిరోజూ సుమారు 10.82 లక్షల యూనిట్ల నీటిబాటిళ్లు అమ్మకం కైవసం చేసుకుంటోంది.ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రయాణికుల సౌకర్యం కోసం ‘రైల్ నీర్’ పేరుతో సొంత బ్రాండ్‌ను ప్రారంభించింది. రైలు ప్రయాణికులకు పరిశుభ్రమైన నీటిని అందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రారంభమైన ఈ వ్యాపారం, ఇప్పటివరకు విజయవంతంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం రైల్ నీర్ నీటిని రూ.15 లీటర్ ధరకు అందిస్తున్న ఐఆర్సీటీసీ, దీనివల్ల భారీగా ఆదాయం ఆర్జిస్తోంది. రోజూ 14 లక్షల నీటిబాటిళ్ల ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థ, 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 39.5 కోట్ల విలువైన బాటిళ్లను ఉత్పత్తి చేసింది. ఈ బాటిళ్ల అమ్మకాలను చూస్తే, ప్రతిరోజూ సుమారు 10.82 లక్షల యూనిట్ల నీటిబాటిళ్లు అమ్మకం కైవసం చేసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం నీటిబాటిళ్లను మాత్రమే అమ్మి రూ.29.22 కోట్ల ఆదాయాన్ని సాధించి, రికార్డు సృష్టించింది.ఐఆర్సీటీసీకు మొత్తం 16 ప్లాంట్లు ఉన్నాయి. అందులో 4 ప్లాంట్లు సొంతంగా నిర్వహిస్తున్నారు. 12 ప్లాంట్లు పీపీపీ మోడల్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ప్లాంట్లు నంగ్లోయి, దానాపూర్, పాలూర్, అంబర్నాథ్, అమేథి, పర్సాల, బిలాస్పూర్, సనంద్, హావూర్, మందిదీప్, నాగ్పూర్, జాగిరోడ్, మనేర్, సంక్రైల వంటి ప్రాంతాల్లో ఉన్నాయి.తాజా నివేదికల ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 395 మిలియన్ బాటిళ్ల నీటిని ఉత్పత్తి చేశారు. గత ఏడాది, ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం సంస్థకు మరింత లాభం చేకూర్చింది. 2003లో రైల్ నీర్ ప్యాకేజ్డ్ తాగునీటి వ్యాపారం మొదలుపెట్టింది.రైల్ నీర్ నీటిని అత్యాధునిక ఆటోమేటెడ్ ప్లాంట్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఇది పూర్తిగా ఆటోమేటెడ్ ప్లాంట్, ఇక్కడ ఏ దశలోనూ నీటిని చేతులు తాకవు. దీని ద్వారా ఉత్పత్తి సమయంలో అధిక నాణ్యతను నిర్ధారించేందుకు ఐఆర్సీటీసీ పర్యవేక్షణ చేపడుతుంది.రైల్ నీర్‌ను ఎక్కడా కూడా చేతులు కలవకుండా  ఉత్పత్తి చేస్తారు. మొత్తం ప్రక్రియ ఐఆర్సీటీసీ నియంత్రణలో ఉండటం ద్వారా, వినియోగదారులకు శుద్ధమైన, నాణ్యమైన నీటిని అందించడం వల్ల ఈ బ్రాండ్‌కు విశ్వసనీయత పెరిగింది. ఈ విధంగా రైల్ నీర్ ప్రస్తుతం ఐఆర్సీటీసీకి మంచి ఆదాయ వనరుగా మారింది. మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

Related Posts