తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన 60లక్షల లెక్టర్లలో భూమిని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు సాగుచేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నుంచి సాగు తగ్గిపోతుంది. వ్యవసాయం పై ఇప్పటి వరకు స్టేట్ లెవల్ బ్యాంక్ మీటింగ్ ఏర్పాటు చెయ్యలేదని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. బుధవారం నాడు అయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రచారం మీద శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప పనుల మీద చూపిస్తున్నారు. వ్యవసాయ పనిముట్లు రైతులకు ఇవ్వడంలో చేతివాటం చూపిస్తున్నారు.కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయాన్ని వ్యాపారంగా చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి టీఆరెస్ కార్యకర్తల బెజుల్లోకి వెళ్తున్నాయని అయన ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్ పై శ్వేతపత్రం విడుదల చెయ్యాలి. వ్యవసాయ శాఖలో భారీగా అవకతవకలు జరిగాయి...ప్రభుత్వం విచారణ చేయించాలి. తెలంగాణ లో పండిగా వచ్చింది..టీఆరెస్ నేతలకు కానీ రైతులకు కాదని అయన అన్నారు. ప్రైవేట్ వడ్డిదారుల వైపు రైతులు వెళ్లకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేసీఆర్ రైతులకు ఓట్ల కోసమే నోట్లు పంచుతున్నారని అయన విమర్శించారు.